ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కస్టమర్లకోసం మరో సేల్ను అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్ ఇండియా 'గ్రాండ్ గేమింగ్ డేస్' సేల్ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్టు 22 నుంచి ఆగస్టు 24 వరకు కస్టమర్లకు అందుబాటులో ఉండనుంది. గ్రాండ్ గేమింగ్ సేల్స్లో భాగంగా ల్యాప్టాప్స్, టీవీలు డెస్క్టాప్లు, మానిటర్లు, అధునాతన హెడ్ఫోన్లు, గేమింగ్ కన్సోల్లు, గ్రాఫిక్ కార్డులు, లెనోవో, ఏసర్, ఆసూస్, ఎల్జీ, హెచ్పీ, సోనీ వంటి ప్రముఖ బ్రాండ్ టీవీలకు ఆఫర్లు, డీల్స్ను అమెజాన్ తన కస్టమర్లకు ఆఫర్ చేయనుంది.
చదవండి: China Stands With Taliban: తాలిబన్లతో చైనా దోస్తీ..! భారీ పన్నాగమేనా..!
డెల్, కోర్సెయిర్, కాస్మిక్ బైట్, జేబీఎల్ మరిన్ని కంపెనీల ఉత్పత్తులపై సుమారు 30 శాతం మేర తగ్గింపును ప్రకటించాయి. అధిక ర్యామ్, అధిక రిఫ్రెష్ రేట్ ఉన్న టీవీలపై కూడా 30 శాతం తగ్గింపును అమెజాన్ తన కస్టమర్లకు అందిస్తోంది. అదనంగా కొనుగోలుదారలు ఎంచుకున్న మోడళ్లపై తగ్గింపుతో పాటు నో-కాస్ట్ ఈఎమ్ఐ, ఎక్సేఛేంజ్ ఆఫర్లను కూడా పొందవచ్చును.
పలు ల్యాప్టాప్లపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు
పలు టీవీలపై అమెజాన్ అందిస్తోన్న ఆఫర్లు..
చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్ మస్క్కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్బెజోస్...!