ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తన కస్టమర్లకు ప్రైమ్ డే సేల్ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సేల్ జూలై 26 నుంచి జూలై 27 వరకు రెండు రోజలపాటు జరగనుంది. అమెజాన్ ఈ సేల్లో భాగంగా సరికొత్త ఉత్పత్తులను లాంచ్ చేయనుంది. పలు ఉత్పత్తులపై భారీగా ఆఫర్లను ఇవ్వనుంది. హెచ్డీఎఫసీ బ్యాంకు క్రెడిట్ లేదా డెబిట్ కార్డులపై ఉత్పత్తులను కొనుగోలు చేస్తే 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ స్మార్ట్ఫోన్స్, ఫిట్నెస్ అక్సేసరీస్, టీవీలు, అమెజాన్ గ్యాడ్జెట్స్, అలెక్సా పవర్డ్ డివైజ్లపై భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ సేల్ కేవలం ప్రైమ్ మెంబర్షిప్ సభ్యులకు మాత్రమే.
అమెజాన్ ఫోన్లపై అందిస్తోన్న ఆఫర్లు
ఫిట్నెస్ ట్రాకర్స్, ల్యాప్ట్యాప్లపై..
మొబైల్ ఆక్సేసరిస్ రూ.69 నుంచి ప్రారంభం కానున్నాయి. ల్యాప్ట్యాప్లపై సుమారు రూ. 35 వేల వరకు డిస్కౌంట్లను అందించనుంది. గేమింగ్, ఫిట్నెస్ ట్రాకర్స్పై సుమారు 60 శాతం వరకు డిస్కౌంట్లను ఇవ్వనుంది. హెడ్ఫోన్స్పై 75 శాతం వరకు, స్పీకర్స్, హై స్పీడ్ రూటర్స్, వైఫై స్మార్ట్ సెక్యూరిటీ కెమెరాల పై సుమారు 70 శాతం వరకు, డేటా స్టోరేజ్ డివైజ్లపై సుమారు 60 శాతం వరకు, కంప్యూటర్ కంపోనెంట్స్, మానిటర్స్పై సుమారు 50 శాతం వరకు తగ్గింపును కొనుగోలుదారులు ప్రైమ్ డే సేల్ భాగంగా పొందవచ్చును.
హోమ్ ఆప్లియన్స్పై..
ఏసీలపై సుమారు 40 శాతం, రిఫ్రిజరేటర్లపై 30 శాతం, వాషింగ్ మెషిన్లపై సుమారు 30 శాతం, మైక్రో వేవ్స్పై 35 శాతం, 43, 40 ఇంచుల స్మార్ట్ టీవీలపై సుమారు 50 శాతం వరకు, 4కే టీవీలపై సుమారు 60 శాతం భారీ డిస్కౌంట్లను ఈ సేల్ పొందవచ్చును.