ఆనంద్‌ మహీంద్రాకు ఆర్బీఐ బంపరాఫర్‌!

15 Jun, 2022 17:58 IST|Sakshi

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్బీఐ బోర్డ్‌లో పార్ట్‌ టైం నాన్‌ అఫిషియల్‌ డైరెక్టర్‌లుగా ఆనంద్‌ మహీంద్రా, పంకజ్‌ పటేల్‌, వేణు శ్రీనివాసన్‌, ఐఐఎం - అహ్మదాబాద్‌ ప్రొఫెసర్‌ రవీంద్ర డొలాకియాలను నిర్మిస్తూ అధికారంగా ప్రకటించింది. 

జూన్‌ 14 వ్యాపార వేత్తలతో పాటు, ఫ్రొఫెసర్‌లను ఉన్నత బాధ్యతలు అప్పగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో  మహీంద్రా అండ్‌ మహీంద్రా చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా, టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ ఛైర్మన్‌ వేణు శ్రీనివాసన్‌, జైడూస్‌ లైఫ్‌ సైన్సెస్‌ ఛైర్మన్‌ పంకజ్‌ పటేల్‌లతో పాటు రిటైర్డ్‌ ఐఐఎం - ఏ ప్రొఫెసర్‌లను నాలుగేళ్ల పాటు ఆర్బీఐ ఈ కీలక బాధ్యతల్ని అప్పగించింది.   
 

మరిన్ని వార్తలు