ఆనంద్ మహీంద్ర : 'కార్న్' టైర్ బైక్ చూశారా

27 Aug, 2020 20:48 IST|Sakshi

సాక్షి, ముంబై:  సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే పారిశ్రామిక వేత్త ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర  మరో అరుదైన వీడియోనొకదాన్ని షేర్ చేశారు.  ఈ సందర్భంగా  రైతు సోదరుల క్రియేటివిటీకి ముగ్దులయ్యారు. బైక్‌లు, ట్రాక్టర్లను మల్టీ టాస్కింగ్ యంత్రాలుగా మలుచుకునే వీడియోలు తరచూ తన దృష్టికి వస్తున్నాయి... కానీ తాను ఎపుడూ ఊహించని టెక్నిక్ ఇందులో ఉందని  పేర్కొన్నారు. కాంటినెంటల్ టైర్ బ్రాండ్ కు  ఇక ‘కార్న్’టినెంటల్ అనే ప్రత్యేక బ్రాండ్ ఉండాలేమో అంటూ చమత్కరించారు. అయితే బైక్ టైర్ ద్వారా మొక్కజొన్నపొత్తు గింజలను సునాయాసంగా వొలుస్తున్న  వీడియోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేసుకోండి మరి.

>
మరిన్ని వార్తలు