రెక్కలు కట్టుకుని ఎగిరిపోదాం.. ఆనంద్ మహీంద్రా వెరైటీ విషెస్‌

31 Dec, 2021 14:27 IST|Sakshi

సంతోషం, బాధ, పండగలు, ప్రతిభలు ఇలా అంశం ఏదైనా సోషల్‌ మీడియా వేదికగా స్పందించడంలో ముందుంటారు మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా. న్యూ ఇయర్‌ని పురస్కరించుకుని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టేలా.. భవిష్యత్తు పట్ల భరోసా కలిగించేలా ఓ వీడియోను షేర్‌ చేస్తూ న్యూ ఇయర్‌ విషెస్‌ తెలిపారు.

తీవ్రంగా గాయపడిన ఓ ఆండియన్‌ కండోర్‌ పక్షికి రోజుల తరబడి చికిత్స అందించారు చిలీ వైద్యులు. ఆ తర్వాత ఆ పక్షిని జాగ్రత్తగా పర్వత ప్రాంతాలకు వద్దకు తీసుకువచ్చి వదిలారు. కాసేపు ఎగిరేందుకు ఇబ్బంది పడ్డ ఆ పక్షి.. ఆ తర్వాత స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ప్రకృతిలో మమేకమైంది. 

ఆనంద్ మహీంద్రా ట్వీట్‌ చేసిన వీడియో పాతదే అయితే ఆ వీడియోను ప్రస్తుత కరోనా పరిస్థితులకు ముడిపెట్టారు ఆనంద్‌ మహీంద్రా. కోవిడ్‌ కారణంగా గత రెండేళ్లుగా మన జీవితాలు అతలాకుతలం అయ్యాయని, రాబోయే ఏడాదిలో ఈ కష్టాలను జయించి హాయిగా స్వేచ్ఛగా జీవిద్దాం అనే అర్థం వచ్చేలా ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌ చేశారు.
 

మరిన్ని వార్తలు