అతిపెద్ద ఆటో ఎక్స్‌పో వాయిదా

4 Aug, 2021 10:24 IST|Sakshi

న్యూఢిల్లీ: థర్డ్‌ వేవ్‌ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో 2022 ఫిబ్రవరిలో గ్రేటర్‌ నోయిడాలో జరిగే ఆటో ఎక్స్‌పో వాయిదా పడింది. రెండేళ్లకోసారి ఈ వాహన ప్రదర్శన జరుగుతుంది. ప్రదర్శన తిలకించేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు వస్తారని, సామాజిక దూరం నిర్వహణ క్లిష్టమవుతుందని సొసైటీ ఆఫ్‌ ఇండియన్‌ ఆటోమొబైల్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌ (సియామ్‌) తెలిపింది.

కోవిడ్‌–19 పరిస్థితులను ఆధారంగా చేసుకుని కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించేదీ ఈ ఏడాది చివరికల్లా నిర్ణయిస్తామని వివరించింది. 2020లో జరిగిన ఆటో ఎక్స్‌పోను ఆరులక్షల పైచిలుకు మంది సందర్శించారు. 70 దాకా కొత్త మోడళ్లను కంపెనీలు ఆవిష్కరించాయి.
 

మరిన్ని వార్తలు