ఆజాద్‌ ఇంజనీరింగ్‌ మరో ప్లాంటు

22 Dec, 2022 11:05 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రెసిషన్‌ ఇంజనీరింగ్‌ ఉత్పత్తుల తయారీలో ఉన్న ఆజాద్‌ ఇంజనీరింగ్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్‌ కోసం హైదరాబాద్‌ సమీపంలోని తునికిబొల్లారం వద్ద రూ.165 కోట్లతో ఈ కేంద్రాన్ని ప్రత్యేకంగా స్థాపిస్తోంది.

300 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 2024 మధ్యకాలంలో ప్లాంటులో కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.

చదవండి: బీభత్సమైన ఆఫర్‌: జస్ట్‌ కామెంట్ చేస్తే చాలు.. ఉచితంగా రూ.30 వేల స్మార్ట్‌ఫోన్‌!

మరిన్ని వార్తలు