భారత్‌లో బీఎండబ్ల్యూ కొత్త కారు.. ధర రూ.1.22 కోట్లు

18 Jan, 2023 20:01 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: లగ్జరీ కార్ల తయారీలో ఉన్న జర్మనీ సంస్థ బీఎండబ్ల్యూ తాజాగా ఎక్స్‌7 ఎస్‌యూవీని భారత్‌లో ప్రవేశపెట్టింది. ధర రూ.1.22 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది. పెట్రోల్, డీజిల్‌ వేరియంట్లలో లభిస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.

చెన్నై ప్లాంటులో ఈ కార్లను తయారు చేస్తున్నారు. 3 లీటర్‌ 6 సిలిండర్‌ ఇంజన్‌ పొందుపరిచారు. గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని పెట్రోల్‌ వర్షన్‌ 5.8 సెకన్లలో, డీజిల్‌ వర్షన్‌ 5.9 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ ప్రకటన తెలిపింది.    

మరిన్ని వార్తలు