ఆడి ఎస్‌యూవీ క్యూ7కు బుకింగ్‌లు ప్రారంభం

12 Jan, 2022 13:08 IST|Sakshi

న్యూఢిల్లీ: లగ్జరీ కార్ల కంపెనీ ఆడి తన నూతన వెర్షన్‌ ప్రీమియం ఎస్‌యూవీ ‘క్యూ7’కు బుకింగ్‌లు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. 3 లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌తో ఉండే ఈ కారు కోసం ముందుస్తుగా రూ.5 లక్షలు చెల్లించి బుక్‌ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. 

2021లో తొమ్మిది ఉత్పత్తులను విడుదల చేశామని.. ఆడి క్యూ7 బుకింగ్‌లతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించం ఉత్సాహంగా ఉన్నట్టు పేర్కొంది. కొత్త డిజైన్, కొత్త సదుపాయాలతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలిపింది. అడాప్టివ్‌ ఎయిర్‌ సస్పెన్షన్, క్వాట్టో ఆల్‌వీల్‌ డ్రైవ్, పార్క్‌ అసిస్ట్‌ తదితర ఎన్నో అత్యాధునిక సదుపాయాలు ఈ కారులో ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు