ఫ్యాక్ట్‌ చెక్‌ : ఆధార్‌ కార్డు ఉంటే కేంద్రం రూ.5 లక్షలు రుణం ఇస్తుందా?

20 Nov, 2022 22:01 IST|Sakshi

ఆధార్‌ కార్డు ఉంటే చాలు కేంద్ర ప్రభుత్వం దాదాపూ రూ. 5లక్షల వరకు రుణం ఇస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇంతకీ కేంద్రం ఈ పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుందా? అందులో నిజా నిజాలేంటో తెలుసుకుందాం.  

ప్రతీ పనికి ఆధార్‌ను ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. సిమ్‌ కార్డు నుంచి బ్యాంక్‌ ఖాతాల వరకు ఆధార్‌ తప్పనిసరి అయిపోయింది. ఆధార్‌ కార్డు లేనిదే కొన్ని పనులు జరగవు. ఈ నేపథ్యంలో ఆధార్‌ కార్డు వినియోగదారులకు కేంద్రం  రూ. 4 లక్షల 78 వేల రుణం అందనుందనే ప్రచారం జరుగుతోంది.  

ఈ ప్రచారాన్ని కేంద్రానికి చెందిన ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(పీఐబీ) కొట్టిపారేసింది. ఈ తరహాలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి పధకాల్ని అమలు చేయడం లేదని స్పష్టం చేసింది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌లో ఆధార్ కార్డు రుణం వ్యవహారమంతా ఫేక్ అని తేలింది. ఆధార్‌ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.

మరిన్ని వార్తలు