ఏం తమషాగా ఉందా? ముందు ఆ ‘షాట్‌’ ప్రసారాలు ఆపేయండి

4 Jun, 2022 19:37 IST|Sakshi

భారత్‌కు చెందిన పర్‌ఫ్యూమ్‌, డియోడ్రంట్‌, స్ప్రే తయారీదారు కంపెనీ లేయర్స్‌కి షాక్‌ తగిలింది. క్రియేటివిటీ పేరిట రూపొందించిన మహిళలను అగౌరవపరిచేలా ఉన్న సెమీ బూతు అడ్వెర్‌టైజ్‌మెంట్‌పై కేంద్రం కన్నెర్ర చేసింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ యాడ్‌ కనిపించకూడదంటూ ఆదేశాలు జారీ చేసింది. 

లేయర్స్‌ సంస్థ షాట్‌ పేరుతో ఇటీవల ఓ యాడ్‌ ప్రోమోను రెడీ చేసింది. ఈ యాడ్‌ రిలీజ్‌ కావడం ఆలస్యం దుమారం చెలరేగింది. ఈ యాడ్‌ ద్వందార్థాలతో మహిళలను కించపరిచేలా మహిళలపై లైంగిక దాడులకు ప్రోత్సాహం అందించేలా ఉందంటూ స్త్రీ వాదులతో పాటు  ప్రజా సంఘాలు విమర్షలు ఎక్కుపెట్టాయి. సోషల్‌ మీడియాలోనూ ఈ యాడ్‌కి పెద్దగా మద్దతు లభించలేదు. అన్ని వైపుల నుంచి ఘాటైన విమర్శలు ఎదుర్కొంది లేయాన్స్‌.

లేయాన్స్‌ తాజా యాడ్‌ వివాదంపై కేంద్రం కూడా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ యాడ్‌ యూట్యూబ్‌, ట్విటర్‌లో కనిపంచడానికి వీలులేదంటూ ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ ఐటీ రూల్స్‌ - 2021కి విరుద్ధంగా ఉన్నందున ఈ నిషేధం అమలు చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు యూట్యూబ్‌, ట్విటర్‌లకు ఈమెయిల్‌ ద్వారా ఆదేశాలు పంపింది కేంద్రం. 

చదవండి: వీడియో: ఇదెక్కడి ‘షాట్‌’.. డబుల్‌ మీనింగ్‌ యాడ్స్‌పై దుమారం

మరిన్ని వార్తలు