జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణ ఇంకా నిర్ణయించలేదు 

20 Apr, 2022 12:44 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వ స్పష్టీకరణ 

న్యూఢిల్లీ: జీఎస్‌టీ కౌన్సిల్‌ నియమించిన మంత్రుల బృందం జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణపై ఇంకా చర్చించలేదని అధికార వర్గాలు వెల్లడించాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్‌ బొమ్మై అధ్యక్షతన ఏడుగురు సభ్యుల బృందం పరిశీలనలో ఈ ప్రతిపాదన ఉంది.

జీఎస్‌టీలో 5, 8, 12, 18, 28 శాతం రేట్లు అమల్లో ఉన్నాయి. దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం రేటు అమలవుతోంది. ఇందులో 5 శాతం శ్లాబ్‌ను ఎత్తివేసి, అందులో ఉన్న వాటిని 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదన మంత్రుల బృందం పరిశీలనలో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. 

చదవండి: ప్రపంచంలోనే మరే దేశానికి సాధ్యపడకుండా..జెట్‌ స్పీడ్‌లో దూసుకుపోతున్న భారత్‌..!

మరిన్ని వార్తలు