ప్రపంచానిది ఓ దారి.. చైనాది మరో దారి! సొంత స్పేస్​స్టేషన్​లో ఆరునెలలు..

16 Oct, 2021 08:49 IST|Sakshi

అంతరిక్ష పరిశోధనల్లో ప్రపంచ దేశాలన్నీ వేర్వేరు ఎజెండాతో ముందుకు వెళ్తుంటే.. చైనా మాత్రం డిఫరెంట్​ పంథాలో నడుస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యాలు మాత్రం స్పేస్​ టూరిజంలో  ఆధిపత్యం ప్రదర్శించడం కోసం ప్రయోగాలు చేస్తున్నాయి. అయితే చైనా మాత్రం భిన్నంగా ఏలియన్ల ఉనికి కోసమే అంతరిక్ష ప్రయోగాలు చేపడుతుండడం గమనార్హం.
 

ఈ క్రమంలో మరో అరుదైన ఘట్టానికి చైనా వేదికైంది. ముగ్గురు వ్యోమగాములతో చైనా రాకెట్​ నింగికెగసింది. అయితే ఇది ఇతర గ్రహా ప్రయోగం కాదు. చైనా భారీ ఖర్చుతో నిర్మించిన సొంత స్పేస్​ స్టేషన్​ కోసం. భారతకాలమానం ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి దాటాక గోబీ ఎడారిలోని జిక్యూక్వాన్​ లాంచ్ సెంటర్​ నుంచి లాంగ్​ మార్చ్​ 2 ఎఫ్​ రాకెట్​ లాంఛ్​ అయ్యింది. మొత్తం ముగ్గురు (షెంజావు 13 స్పేస్​షిప్​) వ్యోమగాములు ఆరు నెలలపాటు చైనా నిర్మించిన టియాన్​గాంగ్​ స్పేస్​ స్టేషన్​లో గడపనున్నారు.

ఇప్పటిదాకా చైనా చేపట్టిన సుదీర్గ అంతరిక్ష ప్రయోగం ఇదే. టియాన్​గాంగ్​ స్పేస్​ స్టేషన్​లో ఎక్విప్​మెంట్​ను సెటప్​ చేయడంతో పాటు టెక్నాలజీని పరీక్షించడానికి వీళ్లు బయలుదేరారు. తద్వారా ఏలియన్ల కోసం పరిశోధనను ముమ్మరం చేయనున్నారు. 2008లో చైనా తరపున స్పేస్​ వాక్​ చేసిన జాయ్​ ఇఝ్​గ్యాంగ్​​ తాజా మిషన్​కు నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే చైనాకి ఇది రెండో అధికారిక స్పేస్​ యాత్ర. ఏలియన్ల ఉనికి పరిశోధన కోసం చైనా అతిపెద్ద సిగ్నల్​ వ్యవస్థను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

చదవండి: నటుడి అరుదైన రికార్డు

మరిన్ని వార్తలు