ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానానికి తృటిలో తప్పిన భారీ ప్రమాదం

14 Sep, 2022 15:37 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌ విమానం భారీ ప్రమాదంనుంచి తృటిలో తప్పించుకుంది. కొచ్చి  రావాల్సిన  ఎయిరిండియా విమానం మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో బుధవారం ఈ ప్రమాదానికి గురైంది. టేకాఫ్‌ సమయంలో  విమానంలో ఉ‍న్నట్టుండి  పొగలు వ్యాపించడం ఆందోళన రేపింది. ఈ ఘటనలో 14 మంది గాయపడ్డారని టైమ్స్ ఆఫ్ ఒమన్ నివేదించింది. 

మస్కట్ నుండి కొచ్చిన్‌కు రావాల్సిన ఐఎక్స్‌-442 ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం మంటలంటుకున్నాయి.  టేకాఫ్‌ సమయంలో పొగలు రావడాన్ని గమనించిన సిబ్బంది స్లైడ్‌ల ద్వారా ప్రయాణికులను ఖాళీ చేయించినట్లు అధికారులు తెలిపారు. విమానం మస్కట్‌నుంచి  కొచ్చికి బయలు దేరాల్సి ఉంది. ప్రయాణికులు అందరినీ (141+ 4గురు శిశువులు) ఖాళీ చేయించామనీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని  సంబంధఙత అధికారి తెలిపారు. అయితే ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు