Credai: ప్రాపర్టీ షో.. అదిరింది...!

15 Aug, 2021 17:06 IST|Sakshi

క్రెడాయ్‌ హైదరాబాద్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో ముగిసింది. కోవిడ్‌ సంక్షోభం తర్వాత అతి పెద్ద ప్రాపర్టీ షోగా ఇది నిలిచింది. వందకు పైగా రియల్‌ ఎస్టేట్‌, డెవలపర్స్‌ ఈ షోలో పాల్గొన్నారు. 

మొదటి షో
కోవిడ్‌ కారణంగా దేశవ్యా‍ప్తంగా రియల్‌ ఎస్టేట్‌ రంగం కుదుపులకు లోనైంది. ముఖ్యంగా సెకండ్‌ వేవ్‌ తర్వాత ఎక్కడా ప్రాపర్టీ షోలు భారీ స్థాయిలో జరగలేదు. అనేక సవాళ్లను అధిగమిస్తూ ఆగస్టు 13,14,15 తేదీల్లో హైటెక్స్‌లో ,  క్రెడాయ్‌ హైదరాబాద్‌ యూనిట్‌ ఈ ప్రాపర్టీ షోను ఏర్పాటు చేసింది.

రియల్‌ పుంజుకుంటోంది
క్రెడాయ్‌ ప్రాపర్టీ షోకు రెస్పాన్స్‌ బాగుందని క్రెడాయ్‌, హైదరాబాద్‌ యూనిట్‌ ట్రెజరర్‌ ఆదిత్య అన్నారు. కోవిడ్‌ మునుపటి స్థితికి  రియల్‌ ఎస్టేట్‌ చేరుకుంటుందనే నమ్మకం కలిగిందన్నారు.  కొత్తగా ఇళ్లలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని తెలిపారు. మరోవైపు ఆఫీస్‌ స్పేస్‌లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇన్సెంటీవ్‌లు ఉండటంతో మార్కెట్‌ ఆశాజనకంగా ఉందన్నారు.

రెస్పాన్స్‌ బాగుంది
ప్రాపర్టీ షో ప్రారంభం కాకుముందు జనాల రెస్సాన్స్‌ ఎలా ఉంటుందో అనే అనుమానం ఉండేదని, కానీ ఈ షో ప్రారంభమైన తర్వాత అనుమానాలు అన్నీ పటాపంచలైపోయాంటూ తెలిపింది గౌరు డెవలపర్స్‌కి చెందిన కావ్య. కొత్త ఇళ్లులు, స్థలాలు కొనాలనుకునే వారి సంఖ్య పెరిగిందని, మూడు రోజులుగా వస్తున్న వారికి తమ ప్రాజెక​‍్టుల గురించి వివరిస్తున్నామంది.

మార్కెట్‌పై అవగాహన
దాదాపు పద్దెనిమిది నెలలుగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితయ్యారు. అత్యవసర పనులకే బయటకు వస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లో ధరలు ఎలా ఉన్నాయనే దానిపై సరైన అవగాహన ఉండటం లేదు. అయితే క్రెడాయ్‌ భారీ ప్రాపర్టీ షో ఏర్పాటు చేయడంతో మార్కెట్‌పై అవగాహన కోసం చాలా మంది వస్తున్నారు. ముఖ్యంగా గృహిణిలు కొత్త ఇళ్ల గురించి ఎక్కువగా వాకాబు చేస్తున్నారు.

మొత్తంగా రియల్‌ ఎస్టేట్‌  రంగంపై ముసురుకున్న అనుమానాలను క్రెడాయ్‌ ప్రాపర్టీ షో పటాపంచలు చేసింది.
 

మరిన్ని వార్తలు