విలువలో 102.2 బిలియన్ డాలర్లు
ఆర్బీఐ గణాంకాల వెల్లడి
ముంబై: దేశం కరోనా సవాళ్లను ఎదుర్కొన్న 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత్ 0.9 శాతం (స్థూల దేశీయోత్పత్తి విలువలో) కరెంట్ అకౌంట్ మిగులును నమోదు చేసుకుందని ఆర్బీఐ బుధవారం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. విలువలో ఇది 102.2 బిలియన్ డాలర్లు(7,62,616.4 కోట్లు). గత 17 ఏళ్లలో మొదటిసారి ఎఫ్వై 21లో కరెంట్ అకౌంట్ మిగులు సాధించింది. ఒక దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది.
వచ్చిన దానికన్నా చెల్లింపులు అధికంగా ఉండే పరిస్థితి ‘కరెంట్ అకౌంట్ లోటు’. చెల్లింపులకన్నా దేశంలోకి వచ్చిన మొత్తాలు అధికంగా ఉంటే అది కరెంట్ అకౌంట్ మిగులు. ఇక 2019-20లో 0.9 శాతం కరెంట్ అకౌంట్ లోటును నమోదుచేసుకుంది. విలువలో ఇది 157.5 బిలియన్ డాలర్లు. గణాంకాల ప్రకారం..
చదవండి: ఎంఐ 12 స్మార్ట్ఫోన్లో రాబోయే ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు