లాభాలతో మొదలైన మార్కెట్‌

1 Nov, 2021 10:53 IST|Sakshi

ముంబై: స్టాక్‌మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైంది. ఏషియాతో పాటు ప్రపంచ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో దేశీ మార్కెట్‌లో జోరు కనిపిస్తోంది. దీనికి గత పది రోజులుగా కొనసాగుతున్న కరెక‌్షన్‌కి ‍తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అయితే ఇటు బీఎస్‌ఈ, అటు ఎన్‌ఎస్‌ఈలు కీలకమైన 60 వేలు, 18 వేల పాయింట్లు క్రాస్‌ చేయడానికి ఇంకా సమయం పట్టేట్టుగా ఉంది. 


ఈ రోజు ఉదయం బీఎస్‌ఈలో సెన్సెక్స్‌ 59,577 పాయింట్లలో మొదలైంది. ఆ తర్వాత 59,833 పాయింట్ల గరిష్టానికి చేరుకుంది. ఆ తర్వాత వరుసగా పాయింట్లు కోల్పోతూ 59,419 పాయింట్లకు చేరుకుంది. మరోసారి నష్టాలు తప్పవనే దశలో తిరిగి కోలుకుంది. ఉదయం 10:46 గంటలకు 220 పాయింట్ల లాభంతో 59,527 పాయింట్లతో కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 97 పాయింట్ల లాభంతో 17,768 దగ్గర ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు