లాభాలతో ప్రారంభమైన మార్కెట్‌

27 Sep, 2021 09:21 IST|Sakshi

స్టాక్‌మార్కెట్లో బుల్‌ జోరు కొనసాగుతూనే ఉంది.  ఈ సెషన్‌ కూడా లాభాలతోనే ప్రారంభమైంది. ఇండియన్‌ బ్యాంక్‌ వార్షిక సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చేసిన వ్యాఖ్యలు మార్కెట్‌కి బూస్ట్‌ని అందించాయి. అయితే రికార్డు స్థాయి హైలలో కొనసాగుతున్న సూచీలు ఏ క్షణమైనా కరెక‌్షన్‌ అవచ్చనే అభిప్రాయం కూడా మార్కెట్‌ వర్గాల్లో వ్యక్తం అవుతోంది.

ఈ రోజు ఉదయం 9:15 గంటలకి  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 321 పాయింట్లు లాభపడి 60,369 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ప్రారంభంలో లాభాలు పొందిన వెంటనే పాయింట్లు నష్టపోయి 17,853 పాయింట్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.

చదవండి : Investment Ideas: నెలవారీ ఆదాయం కోసం ఏ పథకం బెటర్‌?

మరిన్ని వార్తలు