జోరుమీదున్న సెన్సెక్స్‌

6 Sep, 2021 09:30 IST|Sakshi

ముంబై : సెన్సెక్స్‌ జోరు కొనసాగుతూనే ఉంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందనే వార్తలు వెలువడటంతో బాంబే స్టాక్‌ మార్కెట్‌లో సానుకూల వాతావరణం నెలకొంది. దీంతో ఈ రోజు ఉదయం సెషెన్‌ని లాభాలతో సెన్సెక్స్‌ ఆరంభించింది. మరోవైపు నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీలో నిఫ్టీ సూచీ సైతం లాభాల బాట పట్టింది

గత శుక్రవారం సెన్సెక్స్‌ సూచీ 58,129 పాయిం‍ట్ల వద్ద క్లోజవగా ఈ రోజు ఉదయం మార్కెట్‌ ప్రారంభం కాగానే 281 పాయింట్లు లాభపడింది. ఉదయం 9:30 గంటల సమయంలో 58,411 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ సూచీ సైతం . 110 పాయింట్లు లాభపడి 17,413 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. 

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు భారీగా లాభపడగా ఆ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, హిందూస్థాన్‌ యూనిలీవర్‌, టాటాస్టీల్‌ షేర్లు లాభపడగా ఏషియన్‌ పేయింట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెడ్‌డీఎఫ్‌సీ షేర్లు నష్టపోయాయి
చదవండి: రాబడులు, రక్షణ ఒకే పథకంలో..

మరిన్ని వార్తలు