ముంబై: స్టాక్ మార్కెట్లో బుల్ జోరు తగ్గడం లేదు. విజయ దశమి ముందు మొదలైన దేశీ సూచీల హోరు పండగ ముగిసినా తగ్గడం లేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ త్రైమాసికానికి సంబంధించి బ్యాంకులు మంచి ఫలితాలు నమోదు చేశాయి. దీంతో యూస్ స్టాక్ మార్కెట్ సైతం శుక్రవారం లాభాలతో ముగిసింది. ఇలా ఇంటాబయటా పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు మరోసారి రివ్వువపైకి దూసుకుపోతున్నాయి.
ఈ రోజు ఉదయం 9:45 గంటల సమయానికి బీఎస్సీ సెన్సెక్స్ 457 పాయింట్లు లాభపడి 61,173 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 146 పాయింట్లు లాభపడి 18,484 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇన్ఫోసిస్, టాటాస్టీల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ, ఏషియన్ పేయింట్స్ కంపెనీల షేర్లు లాభపడగా బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ షేర్లు నష్టపోయాయి.