ముంబై: స్టాక్మార్కెట్లో కరెక్షన్ కొనసాగుతూనే ఉంది. నిన్న నష్టాలతో మార్కెట్ ముగియగా.. ఈ రోజు కూడా అదే ట్రెండ్ కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఇటు సెన్సెక్స్, అటు నిఫ్టీలు లాభాలతో ఆరభించినా పట్టుమని పదినిమిషాలు కూడా అది నిలిచి ఉండలేదు. ఆ వెంటనే నష్టాల దిశగా సూచీలు పరుగెడుతున్నాయి. మరోసారి సెన్సెక్స్ 61 వేల దిగువకు పడిపోయింది.
ఉదయం 9:30 గంటల సమయంలో బీఎస్ఈ సెన్సెక్స్ 181 పాయింట్లు నష్టపోయి 60,961 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 18,187 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు లాభాలు తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.