స్టాక్‌ మార్కెట్‌.. లాభాల బాట

2 Dec, 2021 10:17 IST|Sakshi

ముంబై: ఏషియల్‌ మార్కెట్లు సానుకూలగా స్పందిస్తుండటం ఇండియన్‌ స్టాక్‌మార్కెట్‌పై ప్రభావం చూపింది. దీంతో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. ఇప్పటి వరకు అమ్మకాలకు ఆసక్తి చూపిస్తూ వచ్చిన ఇన్వెస్టర్లు కొనుగోళ్ల వైపు మళ్లారు. దీంతో దేశీ సూచీలు లాభాబాట పట్టాయి.

ఈ రోజు ఉదయం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 57,781 పాయింట్ల వద్ద మొదలైంది. ఉదయం 10:12 గంటల సమయంలో 319 పాయింట్లు లాభపడి 58,003 దగ్గర ట్రేడవుతోంది. బేర్‌ పంజా విసరడంతో గత సెషల్‌లో 56 వేల దిగువకు పడిపోయిన సెన్సెక్స్‌ తాజాగా 58వేల మార్క్‌ని టచ్‌ చేసింది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 17,273 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు