స్టాక్‌ మార్కెట్‌కి బడ్జెట్‌ బూస్ట్‌.. లాభాల్లో సూచీలు

2 Feb, 2022 09:17 IST|Sakshi

ముంబై: కేంద్ర బడ్జెట్‌ ఇచ్చిన బూస్ట్‌తో దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాకి పెద్ద పీట వేయడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు ఆసక్తి చూపించారు. దీంతో వరుసగా రెండో రోజు దేశీ సూచీలు లాభాల్లో కదలాడుతున్నాయి. ఈ రోజు ఉదయం 9:10 గంటలకి 430 పాయింట్లు లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 59,293 పాయింట్ల వద్ద కదలాడుతోంది.మరోవైపు నిఫ్టీ 129 పాయింట్లు లాభపడి 17,706 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దేశీ సూచీలు జోరుమీద ఉండటంతో మరోసారి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 59 వేల మార్క్‌ని దాటింది.

మరిన్ని వార్తలు