ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆర్థిక సంస్థల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహం నింపుతోంది. ఫలితంగా స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది.
ఈ రోజు ఉదయం 10 గంటలకు బీఎస్ఈ సెన్సెక్స్ 292 పాయింట్లు లాభపడి 60.321 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 17,982 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. భారతీ ఎయిర్టెల్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ షేర్లు లాభాలు పొందగా టైటాన్, సన్ఫార్మా, హెడ్డీఎఫ్సీ, హెచ్యూఎల్ షేర్లు నష్టపోయాయి.