ముంబై: స్టాక్ మార్కెట్ జోరుమీదుంది. మరోసారీ దేశీ సూచీలు లాభాల బాట పట్టాయి. ఏషియా మార్కెట్లు, యూఎస్ మార్కెట్లలో సానుకూల వాతావరణం నెలకొనడంతో విదేశీ ఇన్వెస్టర్లు దేశీ మార్కెట్పై ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు క్యూ 3 ఫలితాలు సైతం ఆశజనకంగా ఉండటంతో మార్కెట్లో జోష్ కనిపిస్తోంది.
ఈ రోజు ఉదయం 9:30 గంటల సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 222 పాయింట్లు లాభపడి 60,360 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 85 పాయింట్లు లాభపడి 18,014 దగ్గర ట్రేడవుతోంది. మార్కెట్లో జోష్ నెలకొనడంతో బీఎస్ఈ 60 వేలు, ఎన్ఎస్ఈ 18 వేల పాయింట్లను క్రాస్ చేశాయి.