బీఈ టీకాకు డీసీజీఐ అనుమతులు

17 Dec, 2022 10:28 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశీయంగా 14–వాలెంట్‌ పీడియాట్రిక్‌ న్యూమోకోకల్‌ కాంజుగేట్‌ టీకా తయారీ, విక్రయాలకు డ్రగ్స్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (డీసీజీఐ) నుంచి అనుమతులు లభించినట్లు బయోలాజికల్‌ వెల్లడించింది. స్ట్రెప్టోకోకస్‌ న్యుమోనియాకు సంబంధించిన ఈ టీకాను 6, 10, 14 వారాల పిల్లలకు 3 డోసులు కింద ఇవ్వొచ్చని పేర్కొంది.

భారత్‌లోను, అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ అయిదేళ్ల లోపు పిల్లల మరణాలకు ఎక్కువగా ఎస్‌ న్యూమోనియా కారణమవుతోందని తెలిపింది. పీసీవీ14తో కోట్ల మంది పిల్లల ప్రాణాలను కాపాడగలమని కంపెనీ ఎండీ మహిమా దాట్ల తెలిపారు.

చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్‌ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్‌!

మరిన్ని వార్తలు