రెనో క్విడ్‌ కొత్త వెర్షన్‌

15 Mar, 2022 08:15 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వాహన తయారీ సంస్థ రెనో ఇండియా క్విడ్‌ కొత్త వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.4.49 లక్షల నుంచి ప్రారంభం. మాన్యువల్, ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్స్‌తో 0.8 లీటర్, 1.0 లీటర్‌ పెట్రోల్‌ పవర్‌ట్రైన్స్‌తో క్విడ్‌ మై22 క్లైంబర్‌ శ్రేణి తయారైంది. ఈ మోడల్‌ భారతీయ మార్కెట్‌లో ప్రస్తుతం ఉన్న అన్ని భద్రతా అవసరాలకు అనుగుణంగా ఉందని వివరించింది.   

మరిన్ని వార్తలు