హైదరాబాద్‌కి ఓకే చెప్పిన గ్రిడ్‌ డైనమిక్స్‌

9 May, 2022 16:28 IST|Sakshi

డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్‌మేషన్‌ రంగంలో ప్రపంచ వ్యాప్తంగా సేవలు అందిస్తున్న గ్రిడ్‌ డైనమిక్స్‌ సంస్థ ఇండియాలో తన కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఇందు కోసం హైదరాబాద్‌లో భారీ ఎత్తున నియమకాలు చేపట్టనుంది.  ఈ విషయాన్ని రాష్ట​ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ‍ట్విటర్‌ వేదికగా తెలిపారు.

గ్రిడ్‌ డైనమిక్స్‌ సీఈవో లియోనార్డో లివ్‌షిట్జ్‌ ఈరోజు మంత్రి కేటీఆర్‌ను కలిశారు. సంస్థ ఏర్పాటుకు సంబంధించిన అంశాలను ఇరువరు చర్చించారు. త్వరలోనే ఆఫీసు ప్రారంభించి ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి మంది వర్క్‌ఫోర్స్‌తో పనులు నిర్వహిస్తామని గ్రిడ్‌ డైనమిక్స్‌ తెలిపింది. అమెరికాతో పాటు యూరప్‌ దేశాల్లో గ్రిడ్‌ డైనమిక్స్‌ సంస్థ డిజటల్‌ ‍ ట్రాన్స్‌ఫర్మేషన్‌ రంగంలో పని చేస్తోంది. 

చదవండి: Cryptocurrency: క్రిప్టో ఢమాల్‌.. భారీగా నష్టోతున్న బిట్‌కాయిన్‌..

మరిన్ని వార్తలు