మహిళలే మహారాణులు,డెరెక్ట్‌ సెల్లింగ్‌లోకి 53 లక్షల మంది

17 Jul, 2021 07:42 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కోవిడ్‌–19 మహమ్మారితో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అదే సమయంలో కొత్త అవకాశాలను వెతుక్కున్నారు. ఇందులో డైరెక్ట్‌ సెల్లింగ్‌ రంగం ఒకటి. 2020 ఏప్రిల్‌–సెప్టెంబరు కాలంలో దేశవ్యాప్తంగా ఈ పరిశ్రమలోకి ఏకంగా 53.18 లక్షల మంది ప్రవేశించారని ఐడీఎస్‌ఏ చెబుతోంది. డైరెక్ట్‌ సెల్లింగ్‌ విపణిలో 2019–20లో దేశవ్యాప్తంగా 74 లక్షల మంది చురుకైన విక్రేతలు ఉన్నారు. ఇది వార్షికంగా 30% పెరుగుదల. 2019–20 గణాంకాల ప్రకారం అమ్మకందార్లలో సగం మంది మహిళలు ఉండడం గమనార్హం.  
 

మరిన్ని వార్తలు