2022లో.. 37.93 లక్షల ప్యాసింజర్‌ వెహికల్స్‌ అమ్మకాలు

2 Jan, 2023 07:30 IST|Sakshi

ముంబై: దేశీయంగా 2022లో మొత్తం 37.93 లక్షల ప్యాసింజర్‌ వాహన విక్రయాలు జరిగాయి. 2021తో పోల్చితే 23% వృద్ధి నమోదైంది. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్‌ మోటార్, స్కోడా ఇండియా కార్లు రికార్డు సేల్స్‌ నమోదు చేసుకున్నాయి. కరోనా ప్రేరేపిత సవాళ్లు, సెమీ కండక్టర్ల కొరత తగ్గడంతో కార్లకు, ముఖ్యంగా స్పోర్ట్స్‌ యుటిలిటీ వెహికల్స్‌ (ఎస్‌యూవీ)లకు గిరాకీ పెరిగింది. 

మరిన్ని వార్తలు