డాక్టర్‌ రెడ్డీస్‌ ‘సిడ్మస్‌’ ఔషధ రేటు తగ్గింపు

19 Jan, 2023 07:18 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌ (డీఆర్‌ఎల్‌) హృద్రోగ చికిత్సలో ఉపయోగించే సిడ్మస్‌ ఔషధం రేటు ను గణనీయంగా తగ్గించింది. దీనితో 50 మి. గ్రా. ట్యాబ్లెట్‌ ధర రూ. 78.32 నుంచి రూ. 29కి తగ్గుతుంది.

అలాగే 100 మి.గ్రా. ధర రూ. 83.86 నుంచి రూ. 49కి, 200 మి.గ్రా. ట్యా బ్లెట్‌ రేటు రూ. 96.71 నుంచి రూ. 79కి తగ్గు తుందని కంపెనీ తెలిపింది. భారత మా ర్కె ట్‌కు సంబంధించి సిడ్మస్‌ బ్రాండును నొవార్టిస్‌ నుంచి గతేడాది డీఆర్‌ఎల్‌ కొనుగోలు చేసింది.

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!

మరిన్ని వార్తలు