యస్‌ బ్యాంక్‌: 900 కోట్లను అటాచ్‌ చేసిన ఈడీ..‌

25 Sep, 2020 15:50 IST|Sakshi

సాక్షి, ముంబై: యస్‌ బ్యాంక్‌ స్కామ్‌లో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. మనీ లాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న యస్‌ బ్యాంకు వ్యవస్థాపకుడు రాణా కపూర్ ఆస్తులను ఈడీ(ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) అటాచ్ చేసింది. ముంబైలోని రూ.127కోట్ల విలువైన ఇల్లును ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.900 కోట్ల విలువైన ఆస్తులును ఈడీ అధికారులు అటాచ్‌ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే దర్యాప్తు అధికారులు ఇటీవల రాణా కపూర్‌తో సహా డిహెచ్ఎఫ్ఎల్ దివాలా ప్రమోటర్లు కపిల్, ధీరజ్ వాధవన్ లకు చెందిన కోట్లాది రూపాయల విలువైన ఆస్తులను ఈడీ రూ.2,203 కోట్ల రూపాయలని అటాచ్‌ చేసిన విషయం తెలిసిందే. వీటిలో రాణి కపూర్‌కు విదేశీ ఆస్తులు కూడా ఉన్నాయని పేర్కొంది. (చదవండి: ఓ మై గాడ్‌... వెంకన్న రక్షించాడు)

మరిన్ని వార్తలు