ఎడెల్వీస్‌ నుంచి 2 టార్గెట్‌ మెచ్యూరిటీ ఫండ్స్‌

3 Oct, 2022 05:50 IST|Sakshi

ఎడెల్వీస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ కొత్తగా మరో రెండు టార్గెట్‌ మెచ్యూరిటీ ఇండెక్స్‌ ఫండ్స్‌ను ఆవిష్కరించింది. క్రిసిల్‌ ఐబీఎక్స్‌ 50:50 గిల్ట్‌ ప్లస్‌ ఎస్‌డీఎల్‌ ఏప్రిల్‌ 2037 ఇండెక్స్‌ ఫండ్‌తో పాటు 2027 జూన్‌లో మెచ్యూర్‌ అయ్యే ఫండ్‌ వీటిలో ఉన్నాయి. ఈ తరహా ఫండ్స్‌లో 15 ఏళ్ల సుదీర్ఘ మెచ్యూరిటీతో ఫండ్‌ను ప్రవేశపెట్టడం దేశీయంగా ఇదే ప్రథమమని సంస్థ ఎండీ రాధికా గుప్తా తెలిపారు. ఈ ఫండ్‌లు ప్రధానంగా భారత ప్రభుత్వ బాండ్లు (ఐజీబీ), రాష్ట్ర అభివృద్ధి రుణాల్లో (ఎస్‌డీఎల్‌) ఇన్వెస్ట్‌ చేస్తాయి. 2037 ఇండెక్స్‌ ఫండ్‌ అక్టోబర్‌ 6న, 2027 ఇండెక్స్‌ ఫండ్‌ అక్టోబర్‌ 11న ముగుస్తాయి. రూ. 5,000 నుంచి ఇన్వెస్ట్‌ చేయొచ్చు.

మరిన్ని వార్తలు