ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) బంపరాఫర్ ఇచ్చింది. ఈ నామినీ ప్రక్రియ నమోదు చేసిన వారికి లక్షల్లో ప్రయోజనాల్ని అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
ఇటీవల ఖాతాదారులు ఈ- నామినీని పూర్తి చేయాలని సూచించింది. నామినీ పూర్తి చేసిన ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్ ) సభ్యులకు అనేక ప్రయోజనాల్ని అందిస్తుంది. పీఎఫ్ ఖాతాదారులు ఇ-నామినేషన్ను దాఖలు చేయడం ద్వారా అవాంతరాలు లేని, వేగవంతమైన ఆన్లైన్ సేవలు, ఉచితంగా రూ.7లక్షల వరకు బీమాను పొందవచ్చు.
Benefits of filing e-Nomination.
ई-नामांकन दर्ज करने के लाभ।#EPF #SocialSecurity #eNomination #AmritMahotsav @AmritMahotsav pic.twitter.com/xJ8AZbkZjD
— EPFO (@socialepfo) March 22, 2022
"ఈ-నామినేషన్ దాఖలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు మీకు తెలుసా ?"
సభ్యుడు మరణించిన తర్వాత ఆన్లైన్ లో క్లయిమ్ చేసుకోవచ్చు.
పేపర్లెస్, వేగవంతమైన క్లెయిమ్ సెటిల్మెంట్.
పీఎఫ్, పెన్షన్ ఆన్లైన్ చెల్లింపు.
అర్హులైన నామినీలకు రూ.7 లక్షల వరకు బీమా.