యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీ బాదుడు, మామూలుగా లేదుగా!

28 Oct, 2022 14:17 IST|Sakshi

 0.75 శాతం పెంపు

మాంద్యం భయాలకన్నా... ద్రవ్యోల్బణం కట్టడికే మొగ్గు   

ఫ్రాంక్‌ఫర్ట్‌: మాంద్యం భయాలకన్నా, ద్రవ్యోల్బణం కట్టడికే యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రాధాన్యత ఇచ్చింది. వడ్డీరేటును 0.75శాతం పెంచుతూ  25 మంది సభ్యుల గవర్నింగ్‌ కౌన్సిల్‌ గురువారం ఇక్కడ కీలక నిర్ణయం తీసుకుంది. యూరో కరెన్సీ చరిత్రలోనే ఒకేసారి ఈ స్థాయి రేటు పెంపు ఇదే తొలిసారి.

ఈ ఏడాది మూడవ రేటు పెంపు నిర్ణయమిది.  19 దేశాల యూరోజోన్‌ ఆర్థిక వ్యవస్థపై పొంచి ఉన్న మాంద్యం ముప్పు నేపథ్యంలో సెంట్రల్‌ బ్యాంక్‌ తీసుకున్న నిర్ణయానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీబీ ప్రెసిడెంట్‌ క్రిస్టినా లగార్డ్‌ పేర్కొన్నారు. అమెరికాసహా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ద్రవ్యోల్బణం స్పీడ్‌ కట్టడికి వడ్డీరేట్లను పెంచుతున్న సంగతి తెలిసిందే. యూరోజోన్‌లో 2శాతం లక్ష్యానికి మించి,  ప్రస్తుతం ద్రవ్యోల్బణం 9.9శాతానికి  ఎగసింది.   

మరిన్ని వార్తలు