ఈవీ ట్రాన్స్‌కు భారీ కాంట్రాక్టు 

8 May, 2022 01:56 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహనాల రంగంలో ఉన్న హైదరాబాద్‌ సంస్థ ఈవీ ట్రాన్స్‌ ఓ భారీ కాంట్రాక్టును చేజిక్కించుకుంటోంది. ఒక రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన టెండర్లలో 1,400 ఎలక్ట్రిక్‌ బస్సుల సరఫరాకు లోయెస్ట్‌ బిడ్డర్‌గా నిలిచింది. మరో 700 బస్సులను అందించేందుకూ పోటీ పడుతోంది. ఈ రవాణా సంస్థకు అద్దె ప్రాతిపదికన 12 ఏళ్లపాటు బస్సులను నడుపుతారు.

ఆర్డర్‌ (లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌) చేతికి రాగానే ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుంచి 1,400 బస్సులను ఈవీ ట్రాన్స్‌ కొనుగోలు చేయనుంది. ఈ బస్సుల విలువ రూ.2,450 కోట్లు. డీల్‌ కార్యరూపం దాలిస్తే ఒలెక్ట్రాకు ఇదే అతిపెద్ద ఆర్డర్‌గా నిలవనుంది. ఈవీ ట్రాన్స్, ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ రెండూ కూడా మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ (ఎంఈఐఎల్‌) అనుబంధ కంపెనీలు.


 

మరిన్ని వార్తలు