సాక్షి, హైదరాబాద్: క్లౌడ్ ఆధారిత రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ సేవలను అందించే కంపెనీ ఈఎక్స్పీ రియాల్టీ ఏజెంట్ల నమోదులో గణనీయమైన వృద్ధిని సాధిస్తుంది. గతేడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా 32,403 మంది ఏజెంట్లు ఉండగా.. ఇప్పుడది 60 వేల మార్క్ను అధిగమించింది. ఏటా 85 శాతం వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. గతేడాది నవంబర్లో ఇండియాలో సేవలను ప్రారంభించిన ఈఎక్స్పీ రియల్టీలో ప్రస్తుతం 750కి పైగా ఏజెంట్లు, వెయ్యికిపైగా ప్రాపర్టీలున్నాయి.