ఫేస్‌బుక్‌ ఇండియా లాభం రెట్టింపు

10 Dec, 2020 07:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ ఇండియా కంపెనీ గత ఆర్థిక సంవత్సరం(2019–20)లో రూ.1,277 కోట్ల ఆదాయం ఆర్జించింది. అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం(2018–19)లో ఆర్జించిన ఆదాయం (రూ.893 కోట్లు)తో పోల్చితే 43 శాతం వృద్ధి సాధించామని ఫేస్‌బుక్‌ ఇండియా తెలిపింది. నికర లాభం రూ.65 కోట్ల నుంచి రెట్టింపై (107 శాతం వృద్ధితో) రూ.136 కోట్లకు పెరిగిందని పేర్కొంది. భారత కార్యకలాపాల కోసం ఇన్వెస్ట్‌మెంట్స్‌  కొనసాగిస్తామని ఫేస్‌బుక్‌ వెల్లడించింది. చిన్న, పెద్ద వ్యాపారాలు ఆర్థిక రికవరీ సాధించడంలో ఇతోధికంగా తోడ్పాటునందిస్తామని పేర్కొంది.  ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, వాట్సాప్‌లను 250 కోట్లమంది ఉపయోగిస్తున్నారు. కోటి మంది యాక్టివ్‌ అడ్వర్టైజర్లున్నారు. (శాంసంగ్‌ మేకిన్‌ ఇండియా ఉత్పత్తులు)

>
మరిన్ని వార్తలు