ఫ్లిప్‌కార్ట్ చేతికి ట్రావెల్ బుకింగ్ క్లియర్‌ట్రిప్‌

15 Apr, 2021 16:45 IST|Sakshi

ఆన్‌లైన్ ట్రావెల్, టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ క్లియర్‌ట్రిప్‌ను కొనుగోలు చేయనున్నట్లు వాల్‌మార్ట్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ గురువారం(ఏప్రిల్ 4) ప్రకటించింది. క్లియర్‌ ట్రిప్ 100 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు ఈ-కామర్స్ సంస్థ తెలిపింది. ఒప్పందం ప్రకారం, క్లియర్‌ట్రిప్ కార్యకలాపాలు అన్ని ఫ్లిప్‌కార్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతాయి. అలాగే, ఇది ఇలాగే ప్రత్యేక బ్రాండ్‌గా కొనసాగుతుంది. క్యాష్​, ఈక్విటీల రూపంలో మొత్తం 40 మిలియన్​ డాలర్లను ఫ్లిప్​కార్ట్​ క్లియర్​ ట్రిప్​కు చెల్లించనుంది.

2006లో స్థాపించబడిన క్లియర్‌ట్రిప్ తన మొబైల్ యాప్, వెబ్‌సైట్ నుంచి విమాన, రైళ్లు, హోటళ్లను టికెట్లను బుక్ చేసుకోవడానికి అవకాశం కలిపిస్తుంది. క్లియర్‌ట్రిప్​లో ప్రస్తుతం ఇంటిగ్రేటెడ్ ట్రావెల్ అండ్ ఎక్స్‌పెన్స్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్స్, డిఎజి వెంచర్స్, గండ్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రొవైడర్ కాంకర్ టెక్నాలజీస్ వంటి కంపెనీలు పెట్టుబడి దారులుగా ఉన్నాయి. క్లియర్ ‌ట్రిప్ చివరిసారిగా 2016లో నిధుల సమీకరణను చేపట్టింది. దీని ప్రస్తుత మార్కెట్​ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉంది. కరోనాతో విమాన ప్రయాణాలు రద్దవ్వడంతో క్లియర్ ​ట్రిప్ లాభాలను​ అందుకో లేకపోయింది. అయితే, ఫ్లిప్‌కార్ట్ ఇప్పుడు క్లియర్‌ట్రిప్‌లో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకోవడంతో భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందనున్నట్లు కంపెనీ భావిస్తుంది.

చదవండి: 

గడప గడపకి జియో మార్ట్ సేవలు

మరిన్ని వార్తలు