ఎలక్ట్రానిక్ వస్తువులపై ఫ్లిప్‌కార్ట్ లో అదిరిపోయే ఆఫర్స్

23 Mar, 2021 15:03 IST|Sakshi

కొత్త మొబైల్, ఎలక్ట్రానిక్, దుస్తువులు కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ శుభవార్త అందించింది. బిగ్ సేవింగ్ డేస్ 2021 సేల్ పేరుతో ఫ్లీప్‌కార్ట్ మరో కొత్త సేల్ ని తీసుకొనివచ్చింది. ఈ సేల్ మార్చి 24 నుంచి మార్చి 26 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల మాత్రం నేటి నుంచి సేల్ లో పాల్గొనవచ్చు. మూడు రోజుల పాటు జరిగే సేల్ లో మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు, ఇతర ఎలక్ట్రానిక్స్‌పై అద్భుతమైన ఆఫర్స్ అందిస్తుంది. ఎస్‌బిఐ వినియోగదారులు క్రెడిట్ కార్డ్ ద్వారా ఏదైనా వస్తువు కొనుగోలు చేస్తే వారికీ 10 శాతం అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అమెజాన్ మాత్రం మొబైల్ ప్రియుల కోసం అమెజాన్‌ "ఫ్యాబ్‌ ఫోన్స్‌ ఫెస్ట్‌ సేల్"ను తీసుకొచ్చింది. ఈ సేల్ నేటి(మార్చి 22) నుంచి మార్చి 25 వరకు కొనసాగుతుంది. ఈ సేల్ లో రియల్ మీ, పోకో, ఆపిల్ కు సంబందించిన ఉత్పత్తుల ఉన్నాయి.

చదవండి:

కొత్త మొబైల్ కొనాలనుకునే వారికి శుభవార్త!

మరిన్ని వార్తలు