హైదరాబాద్‌లో ఫోర్స్‌ అర్బానియా

13 Mar, 2023 04:54 IST|Sakshi

హైదరాబాద్‌: ఆటోమొబైల్‌ సంస్థ ఫోర్స్‌ మోటర్స్‌ తాజాగా తమ అర్బానియా వాహనాన్ని హైదరాబాద్‌లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌ కోచ్‌ బిల్డర్స్‌ ఎండీ సుదీప్‌ మచా 7 వాహనాలను కొనుగోలుదారులకు అందజేశారు. దీని ధర శ్రేణి రూ. 28.99 లక్షల నుంచి రూ. 31.25 లక్షల వరకు ఉంటుంది.

10, 13, 17 సీటింగ్‌ సామర్థ్యాల వేరియంట్లలో ఈ వాహనం లభిస్తుంది. అర్బానియా వాహనాల ఉత్పత్తి కోసం అధునాత తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు, ఇందుకోసం రూ. 1,000 కోట్ల పైగా ఇన్వెస్ట్‌ చేసినట్లు సంస్థ తెలిపింది.

మరిన్ని వార్తలు