ఐకియా క్యా కియా!.. సిబ్బందికి రూ.954 కోట్ల నజరానా!

2 Nov, 2021 07:45 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐకియా బ్రాండ్‌ పేరుతో ఫర్నీచర్‌ రంగంలో ఉన్న నెదర్లాండ్స్‌కు చెందిన ఇంగ్‌కా గ్రూప్‌ ఔదార్యం చాటుకుంది. కోవిడ్‌–19 మహమ్మారి కాలంలోనూ శ్రమటోడ్చిన ఉద్యోగులకు రూ.954 కోట్ల నజరానా ప్రకటించింది. 

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐకియా రిటైల్, ఇంగ్‌కా సెంటర్స్, ఇంగ్‌కా ఇన్వెస్ట్‌మెంట్స్‌ సిబ్బందికి ఈ మొత్తాన్ని నగదు రూపంలో అందించనున్నట్టు కంపెనీ సోమవారం ప్రకటించింది. 32 దేశాల్లో గ్రూప్‌నకు 1,70,000 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు.  

ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ముంబై, ఢిల్లీ, బెంగళూరు తదితర నగరాలకు విస్తరించింది. తాజాగా ఐకియా సంస్థ సిటీ స్టోర్ల పేరుతో మెట్రో నగరాల్లో అనేక అవుట్‌లెట్లను తెరిచే పనిలో ఉంది.
 

మరిన్ని వార్తలు