మళ్లీ ఎగిసిన పసిడి

19 Oct, 2020 17:48 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ సోమవారం బంగారం ధరలు భారమయ్యాయి. కరోనా వైరస్‌ కేసుల పెరుగుదలతో పాటు అమెరికాలో ఉద్దీపన ప్యాకేజ్‌పై అస్పష్టతతో పసిడికి డిమాండ్‌ పెరిగింది. ఇక ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 213 రూపాయలు పెరిగి 50,760 రూపాయలకు చేరగా, కిలో వెండి ఏకంగా 1075 రూపాయలు భారమై 62,751 రూపాయలు పలికింది. మరోవైపు దేశ రాజధానిలో పదిగ్రాముల పసిడి 182 రూపాయలు పెరిగి 51,740 రూపాయలకు చేరింది. కిలో వెండి 805 రూపాయలు భారమై 63,714 రూపాయలకు ఎగబాకిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ వెల్లడించింది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు 1909 డాలర్లకు పెరిగాయి. చదవండి : భారీగా కుంగిన బంగారం దిగుమతులు

మరిన్ని వార్తలు