ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మార్కెట్లలోకి గూగుల్ పిక్సెల్ 5ఏ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. కొత్తగా లాంచ్ చేసిన స్మార్ట్ఫోన్ గూగుల్ 4ఏ 5జీ మాదిరగానే ఉండనుంది. డిజైన్ మాత్రమే కాదు, చాలా స్పెసిఫికేషన్లు అలాగే ఉన్నాయి. పిక్సెల్ 5 ఎ స్మార్ట్ఫోన్ను కస్టమర్లకు మరింత చౌక ధరకు అందించేందుకు ఈ స్మార్ట్ఫోన్లో కొద్ది మార్పులను చేసింది. ఈ స్మార్ట్ఫోన్ కాస్త పెద్ద డిస్ప్లేతో రానుంది, డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ తో ఈ ఫోన్ను మార్కెట్లలోకి రిలీజ్ చేసింది.
పిక్సెల్ 4ఎ 5జీ మోడల్తో పోలిస్తే చాలా పెద్ద బ్యాటరీని ఈ స్మార్ట్ఫోన్లో అమర్చారు. పిక్సెల్ 5ఏ 5జీ స్మార్ట్ఫోన్ చార్జర్తో పాటురానుంది. కాగా పిక్సెల్ 6 సిరీస్ ఫోన్లకు చార్జర్ రాదని తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కేవలం ఒకే కలర్ బ్లాక్ కలర్లో రానుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ కేవలం యూఎస్ఏ, జపాన్ దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. త్వరలోనే భారత మార్కెట్లలోకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పిక్సెల్ 5ఏ 5జీ ధర సుమారు రూ. 33,400 ఉండనుంది.
గూగుల్ పిక్సెల్ 5ఏ 5జీ ఫీచర్స్