ఆర్బిట్రేషన్ పక్రియలో ఆగిన మొత్తంలో 75 శాతం ఇకపై కాంట్రాక్టర్కు లభ్యం
మంత్రిత్వశాఖలకు వర్తింపజేస్తూ నిబంధనల రూపకల్పన అయితే బ్యాంక్ గ్యారెంటీ తప్పనిసరి
న్యూఢిల్లీ: నిర్మాణ రంగం ఎదుర్కొంటున్న నిధుల లభ్యత (లిక్విడిటీ) సమస్యను నివారించడంపై కేంద్రం దృష్టి సారించింది. ఆర్బిట్రేషన్ పక్రియలో నిలిచిపోయిన మొత్తంలో 75 శాతం ఈ రంగానికి అందుబాటులోకి వచ్చే విధంగా నిబంధనల రూపకల్పన చేసింది. దీనిప్రకారం, కాంట్రాక్టర్కు అనుకూలంగా ఆర్బిట్రల్ అవార్డును (తీర్పు)ను ఒక మంత్రిత్వ శాఖ దాని విభాగం అప్పీలేట్ కోర్టులో సవాలు చేసిన సందర్భంలో అవార్డు ప్రకారం ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతం కాంట్రాక్టర్కు ఇకపై లభ్యమయ్యే అవకాశం ఏర్పడింది. అయితే ఇందుకు సంబంధిత కాంట్రాక్టర్ బ్యాంక్ గ్యారెంటీని సమర్పించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలకు అమలు...
నిజానికి ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ మేరకు ఇప్పటికే నిర్దేశాలు ఉన్నాయి. 2019 నవంబర్లో కేంద్ర క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటూ, ఆర్బిట్రేషన్ అవార్డును ఏదైన ప్రభుత్వ రంగ సంస్థ సవాలు చేసిన సందర్భంలో ‘బ్యాంక్ గ్యారెంటీ’పై కాంట్రాక్టర్కు ఇవ్వాల్సిన మొత్తంలో 75 శాతాన్ని చెల్లించాలని చెల్లించాలని నిర్దేశించింది. ఇప్పుడు ఈ నిబంధనను మంత్రిత్వశాఖలకూ వర్తింపజేస్తూ నిబంధనలు రూపొందించింది. ఇందుకు సంబంధించి జనరల్ ఫైనాన్షియల్ రూల్ (జీఎఫ్ఆర్)లో 227ఏ కొత్త రూల్ను జోడిస్తున్నట్లు వ్యయ వ్యవహారాల శాఖ తన ప్రకటనలో పేర్కొంది. ‘మంత్రిత్వ శాఖ/డిపార్ట్మెంట్ మధ్యవర్తిత్వ అవార్డ్ను సవాలు చేసిన సందర్భాలలో, ఆర్బిట్రల్ అవార్డ్ మొత్తాన్ని చెల్లించనట్లయితే, అవార్డ్లో 75 శాతాన్ని కాంట్రాక్టర్/రాయితీదారుకు బ్యాంక్ గ్యారెంటీపై మంత్రిత్వశాఖ /డిపార్ట్మెంట్ చెల్లించాలి‘అని తన తాజా ఉత్తర్వుల్లో కేంద్ర వ్యయ వ్యవహారాల శాఖ స్పష్టం చేసింది.
మరిన్ని వివరాలు పరిశీలిస్తే...