ఎన్‌ఎండీసీ నగర్నార్‌ ప్లాంటుకు బిడ్ల ఆహ్వానం

2 Dec, 2022 11:15 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎన్‌ఎండీసీకి చెందిన నాగర్నాల్‌ ఉ­క్కు ప్లాంటులో వ్యూ హాత్మక వాటాలను విక్రయించేందుకు కేంద్రం ప్రాథమికంగా బిడ్లను ఆహ్వానించింది. సందేహాలను సమర్పించేందుకు డిసెంబర్‌ 29, బిడ్లను దాఖలు చేసేందుకు 2023 జనవరి 27 ఆఖరు తేదీ అని దీపం తెలిపింది.

చత్తీస్‌గఢ్‌లోని నగర్నార్‌లో ఎన్‌ఎండీసీ 3 మిలి యన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ఎన్‌ఎండీసీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ని ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఎన్‌ఎండీసీ నుండి ఎన్‌ఎండీసీ స్టీల్‌గా విడగొట్టి, ఎక్సే్చంజీల్లో లిస్ట్‌ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

చదవండి: విప్రో చేతికి ప్రముఖ స్టార్టప్‌ కంపెనీ

మరిన్ని వార్తలు