జీఆర్‌టీ జ్యువెలర్స్‌ బ్యాంగిల్‌ మేళా

22 Jul, 2021 03:36 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ జీఆర్‌టీ జ్యువెలర్స్‌ బ్యాంగిల్‌ మేళా నిర్వహిస్తోంది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. విస్తృత శ్రేణిలో వివిధ రకాల మోడల్‌ గాజులను ఆకర్షణీయమైన ఆఫర్లతో సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ మేళాలో భాగంగా బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు రూ.50లు, వజ్రాలు, అన్‌కట్‌ వజ్రాలపై 10 శాతం, వెండి ఆభరణాల ఎంఆర్‌పీపై పదిశాతం డిస్కౌంట్‌ను ఇస్తోంది. కస్టమర్లకు తమకు నచ్చిన డిజైన్లు, గాజులను ఎంపిక చేసుకోవడానికి ఈ మేళా నిర్వహిస్తున్నట్లు కంపెనీ ఎండీ జీఆర్‌ పద్మనాభన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు