జీఆర్‌టీ జ్యువెలర్స్‌: పోల్కి దేవాన్షి ఆభరణాలు అదరహ!

10 Nov, 2022 09:04 IST|Sakshi

హైదరాబాద్‌: జీఆర్‌టీ జ్యువెలర్స్‌ పోల్కి వజ్రాలతో తీర్చిదిద్దిన దేవాన్షి ఆభరణాల శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది. చరిత్రలో రాజ కుటుంబీకులు, సంస్థానాధీశులు ధరించిన ఈ వజ్రాభరణాలు నిపుణులైన హస్తకళాకారుల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి. ఈ అద్భుత శ్రేణిపై 15% వరకు ప్రత్యేక ఆఫర్‌ లభిస్తుంది. ప్రత్యేక రూపకల్పన కోరుకునే కస్టమర్ల కోసం సంప్రదాయ, సమకాలిక అంశాలను మేళవించి పోల్కి దేవాన్షి ఆభరణాలను తీసుకొచ్చామని సంస్థ ఎండీ జీఆర్‌  రాధాకృష్ణన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు