జీఎస్‌టీ వసూళ్లు.. రూ.1.50 లక్షల కోట్లు

2 Jan, 2023 08:39 IST|Sakshi

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు డిసెంబర్‌లో 15% పెరుగుదలతో రూ.1,49,507 కోట్లకు చేరాయి. 2021 ఇదే నెలతో (రూ.1.30 లక్షల కోట్లు) పోల్చితే ఈ పెరుగుదల 15 శాతంగా నమోదయ్యింది.

తయారీ, వినియోగ రంగాల నుంచి డిమాండ్‌ పటిష్టంగా ఉందని గణాంకాలు వెల్లడించాయి. వస్తు సేవల పన్ను వసూళ్లు రూ.1.4 లక్షల కోట్లను అధిగమించడం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది వరుసగా 9వ నెల. 

మరిన్ని వార్తలు