70 శాతం సంస్థలు సానుకూలం
ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆశావహం
సాక్షి, ముంబై: వేగంగా కొనసాగుతున్న టీకాల కార్యక్రమం.. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందన్న అశావహ అంచనాల మధ్య.. 70 శాతం సంస్థలు కార్మికుల నియామకాలను (బ్లూకాలర్ వర్కర్స్) ఇప్పటికే ప్రారంభించాయి. ఓఎల్ఎక్స్ సంస్థ ఓఎల్ఎక్స్ పీపుల్ సర్వే పేరుతో ఒక సర్వే నిర్వహించి వివరాలను విడుదల చేసింది. ఆన్లైన్లో నిర్వహించిన ఈ సర్వేలో 150 కంపెనీల అధిపతులు పాల్గొని అభిప్రాయాలు తెలియజేశారు. (షాపింగ్ మాల్స్కు కరోనా సెకండ్ వేవ్ షాక్!)
సర్వే ఫలితాలు..
7 శాతం పెరగొచ్చు: జూన్ త్రైమాసికంపై టీమ్లీజ్ అంచనా
ఉద్యోగ నియామకాలు ప్రస్తుత త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 7 శాతం వరకు పెరగొచ్చని (జనవరి–మార్చితో పోలిస్తే) టీమ్లీజ్ ఎంప్లాయిమెంట్ అవుట్లుక్ నివేదిక తెలియజేసింది. మరింత లాక్డౌన్లు లేకుండా, పని ప్రదేశాల్లో నిబంధనలను విధించకుండా ఉంటేనే ఈ మేరకు వృద్ధి ఉంటుందని నివేదికలో అంచనా వేసింది. హెల్త్కేర్, ఫార్మాస్యూటికల్స్, విద్యా సేవలు, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు, ఐటీ రంగాల్లో నియామకాలు ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. 21 రంగాలను సమీక్షించగా.. 8 రంగాలు ప్రస్తుత త్రైమాసికంలో ఉద్యోగులను నియమించుకునే ఉద్దేశంతో ఉన్నట్టు టీమ్లీజ్ నివేదిక తెలిపింది. 712 చిన్న, మధ్య, భారీ స్థాయి కంపెనీల అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది. కాగా, ఈ ఏడాది మార్చిలో ఉద్యోగాల భర్తీ ఫిబ్రవరి నెలతో పోలిస్తే 2 శాతం తగ్గినట్టు మాన్స్టర్ డాట్ కామ్ తన నివేదికలో తెలిపింది. (ఈ–కామర్స్కు కరోనా జోష్..!)